తండ్రి డైరెక్షన్ లో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ఆకాష్ పూరి..!?

Anilkumar
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి సైతం హీరోగా మారి తనదైన నటనతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాగా ఈ యంగ్ హీరో తాజాగా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారాడు. మొదటిసారిగా ఆర్ సి ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు ఆకాష్ పూరి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్‌గా పేరు తెచ్చుకుంటోంది.

ఈ క్లాతింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడం హ్యాపీగా ఉందని ఆకాష్ పూరి తెలిపాడు. ఈ కార్యక్రమంలో ఆకాష్ పూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇందులో భాగంగానే తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ.. "నాకు అమ్మా నాన్న ఇద్దరి సపోర్ట్ పూర్తిగా ఉంది. నా స్క్రిప్ట్స్ నాన్న చదువుతారు. మన ఇండస్ట్రీలో చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి. కార్తికేయ 2, హనుమాన్ వంటి మూవీస్ చూసినప్పుడు ఇలాంటి సినిమాల్లో నటించాలి అనే కోరిక కలుగుతుంటుంది. నాన్న పూరి డైరెక్షన్‌లో రామ్ గారు నటిస్తున్న డబుల్

ఇస్మార్ట్ చాలా బాగా వస్తోంది. ఈ మధ్యే టీజర్ రఫ్ కట్ చూశాను. రామ్ గారి అభిమానులు హ్యాపీగా ఫీలయ్యేలా టీజర్ ఉంటుంది. ప్రభాస్ గారిని కలిసినప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడుతారు. ప్రస్తుతానికి నేను సింగిల్ గానే ఉన్నాను. ఏ అమ్మాయినీ ప్రేమించడం లేదు" అని ఆకాష్ పేర్కొన్నాడు. ఆ తర్వాత తన తండ్రి డైరెక్షన్ లో సినిమా గురించి మాట్లాడుతూ.. నేను ఇప్పటికీ చిన్న పిల్లాడిలా ఉంటాను అనే కంప్లైంట్ ఉంది. హీరోగా సెట్ అయిన తర్వాతే విలన్ వంటి క్యారెక్టర్స్ చేయడం గురించి ఆలోచిస్తా. నాన్న పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఇప్పట్లో నటించకూడదు అని అనుకున్నా. నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్న డైరెక్షన్‌లో మూవీ చేస్తా" అని ఆకాష్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: