ప్రియుడితో కలిసి తిరుమలలో జాన్వి కపూర్.. ఫొటోస్ వైరల్..!?

Anilkumar
దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలను అందుకొని సౌత్ ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఈమె కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇదిలా ఉండగా, జాన్వీ కపూర్ తొలిసారి తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.

 కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. టాలీవుడ్ మాత్రమే కాకుండా కన్నడలోనూ జాన్వీ ఓ ప్రాజెక్ట్ చేయనుందని టాక్ వినిపిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ శివన్న కొత్త లో ఈబ్యూటీని ఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. జాన్వీ కొత్త అప్డేట్స్ వరుసగా రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఓవైపు నెట్టింట జాన్వీ పేరు మారుమోతుంది. ఇక ఇదే సమయంలో ఈ బ్యూటీ తన ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

వీరితోపాటు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మహేశ్వరి సైతం వెంకన్నను దర్శించుకున్నారు.  ఇదిలా ఉంటే… మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కొన్నేళ్లుగా ప్రేమలో ఉందనే ప్రచారం నడుస్తుంది. వీరిద్దరు కలిసి రెస్టారెంట్స్.. పార్టీస్.. మూవీ ఈవెంట్లలో కనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలోనూ జాన్వీ, శిఖర్ కలిసి హాజరయ్యారు. ఇక ఇప్పుడు వీరిద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే జాన్వీ, శిఖర్ ఇద్దరితో సోషల్ మీడియాలో సెన్సెషన్ ఓర్రీ కూడా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: