"చారి 111" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో కమీడియన్ గా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో వెన్నెల కిషోర్ ఒకరు. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలలో కమీడియన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా తన కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఈ నటుడు తాజాగా "చారి 111" అనే సినిమాలో హీరో గా నటించాడు. టీజీ కీర్తీ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బర్కత్‌ స్టూడియోస్‌ బ్యానర్ పై నిర్మాత అతిథి సోనీ దీనిని గ్రాండ్ గా నిర్మించిన విషయం తెలిసిందే. సంయుక్తా విశ్వనాథన్‌ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... మురళీ శర్మ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు.
 

ఇకపోతే ఈ సినిమాను మార్చి 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ  సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "యు / ఏ" సర్టిఫికెట్ లభించింది ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటి వరకు కమిడియన్ గా సూపర్ సక్సెస్ అయిన వెన్నెల కిషోర్ ఈ మూవీ తో హీరోగా ఏ స్థాయి గుర్తింపును దక్కించుకుంటాడు చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుంది ..? ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే విషయం తెలియాలి అంటే మార్చి 1 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vk

సంబంధిత వార్తలు: