కొత్త సినిమా ఫిక్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..!?

Anilkumar
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సరైన సక్సెస్ కొట్టేందుకు చాలానే ప్రయత్నిస్తున్నాడు. ఛత్రపతి రీమేక్ అంటూ ఈ మధ్యే చేతులు కాల్చుకున్నాడు. అసలు బెల్లంకొండ హీరో కొట్టి చాలా కాలమే అయింది. రాక్షసుడు అంటూ రీమేక్‌తో హిట్టు కొట్టేశాడు. ఆ తరువాత మళ్లీ ఇంత వరకు హిట్టు అనే దాన్ని చూడలేకపోయాడు. రకరకాల చిత్రాలు, జానర్లు చేస్తూ వస్తున్నాడు.కానీ సక్సెస్ మాత్రం కాలేకపోతోన్నాడు. అల్లుడు శీను' సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన ఆయన… హిందీలో 'ఛత్రపతి' రీమేక్ చేసి అక్కడ కూడా బోణీ కొట్టారు. ఈసారి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్

ఫార్మాట్‌లో హారర్ సినిమా చేస్తారట. ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్వరలో నిర్మాత తదితర వివరాలు బయటికొస్తాయి అని అంటున్నారు. ఈలోపు  సాయి శ్రీనివాస్‌ 'టైసన్‌ నాయుడు' సినిమాను పూర్తి చేస్తాడట. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో 'టైసన్ నాయుడు' తెరకెక్కుతోంది. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పదో చిత్రమిది. ఇప్పటికే వచ్చిన 'టైసన్ నాయుడు' సినిమా గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా పనులు పూర్తి చేసిన సమ్మర్‌లోనే రిలీజ్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

 వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శ్రీను మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బెల్లంకొండ నటించిన స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం వంటి భారీ బడ్జెట్ సినిమాలు క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. కొత్త హీరో అయినా బెల్లంకొండ శ్రీనివాస్ స్టార్ హీరోయిన్స్ సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ లతో ఆడి పాడడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ తో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: