"ఓజి" షూటింగ్లో పవన్ జాయిన్ అయ్యేది అప్పుడే... ప్రొడ్యూసర్ దానయ్య..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం "ఓజి" అనే సినిమాను స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రన్ రాజా రన్ ... సహో లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు అయినటువంటి సుజిత్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో పవన్ కి జోడి గా కనిపించబోతోంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో పవన్ కళ్యాణ్ కు సొంత పార్టీ ఉండటంతో రాజకీయాల పనుల్లోనే పవన్ చాలా బిజీగా సమయాన్ని గడుపుతున్నాడు. దానితో "ఓజి" మూవీ షూటింగ్ లో పవన్ ఎప్పుడు జాయిన్ అవుతాడు ..? ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది అనే విషయంపై పవన్ అభిమానుల్లో చాలా సందేహాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా "ఓజి" మూవీ నిర్మాత అయినటువంటి డి వి వి దానయ్య ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన "ఓజి"  మూవీ కి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా డి వి వి దానయ్య మాట్లాడుతూ ... "ఓజి" మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తి అయింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయ పనులతో చాలా బిజీగా ఉన్నారు. ఆ కారణంతో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే పవన్ గారు "ఓజి" సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు. మేము ముందుగా అనుకున్నటువంటి సెప్టెంబర్ 27 వ తేదీనే ఈ సినిమాను థియేటర్ లలో విడుదల చేస్తాము అని దానయ్య తాజా ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: