రానున్న కాలంలో ఇండియా రూల్ గా అల్లుఅర్జున్...??

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప వంటి రీజినల్ సినిమాతో గ్లోబల్ వైడ్ ఫేమ్ ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పుష్ప 1తో నేషనల్ ఆడియన్స్‌తో పాటు ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకున్నారు.ఇటీవల బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో హాలీవుడ్ సినిమాలతో కలిసి పుష్ప సినిమా కూడా సందడి చేసింది. దీంతో ఈ మూవీకి అంతర్జాతీయ స్థాయిలో మరింత ఫేమ్ ని సంపాదించిపెట్టింది.
కాగా అల్లు అర్జున్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ ప్రశ్నిస్తూ.. 'అల్లు అర్జున్ రూల్ చేయడానికి రాబోతున్నాడా..?' అని అడిగారు. దీనికి అల్లు అర్జున్ బదులిస్తూ.. 'ఇది కేవలం పుష్ప కాదు. ఇది ఇండియా రైజ్. అలాగే రానున్న కాలంలో ఇండియా రూల్ ని కూడా చూస్తారు' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. బన్నీ కామెంట్స్ పై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఫస్ట్ పార్టుకి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇంతటి క్రేజ్ వస్తుండడంతో.. సీక్వెల్ ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు సుకుమార్.. పుష్ప 2ని భారీ స్కేల్ లో రూపొందిస్తున్నారు. మూవీలోని ఎమోషన్స్ అండ్ యాక్షన్ సన్నివేశాలను మొదటి పార్టు కంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారట. ఈక్రమంలోనే సినిమాలోని జాతర సన్నివేశం కోసం చాలా ఖర్చుపెట్టి భారీగా చిత్రీకరిస్తున్నారట.
సినిమాలో ఈ సీక్వెన్స్ హైలైట్ కాబోతుందట. కాగా ఈ చిత్రాన్ని మొత్తం మూడు భాగాలుగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల అల్లు అర్జున్ కూడా ఈ మూడో పార్ట్ గురించి హింట్ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసాయి. పుష్ప ది రైజ్ అంటూ ఫస్ట్ పార్ట్‌ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన మేకర్స్.. పుష్ప ది రూల్ అంటూ సెకండ్ పార్ట్‌ని, పుష్ప రోర్ మూడో భాగంగా తీసుకు రానున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: