తారక్ 'దేవర' మూవీపై.. అప్డేట్ ఇచ్చిన జాన్వి కపూర్?

praveen
త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ మూవీలో భారీ తారాగణం నటిస్తూ ఉండడంతో అంచనాలు అంతకు అంతకు పెరిగిపోతున్నాయి. ఏకంగా తారక్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నాడు  ఇక దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతుంది అని చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులు అందరిలో ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.

 ఇకపోతే ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. దీంతో అభిమానులందరూ కూడా ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన తర్వాత సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు  ఇలాంటి సమయంలో ఇక మేకర్స్ ఊహించని షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 5వ తేదీన విడుదల కావలసిన సినిమాని వాయిదా వేశారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 10వ తేదీన ఇక ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు కొత్త విడుదల తేదీని ప్రకటించారు. కాగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్  గా దేవర రూపొందుతోంది అన్నది తెలుస్తుంది  అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.

 ఇకపోతే ఇటీవల దేవర మూవీ గురించి హీరోయిన్గా నటిస్తున్న జాన్వి కపూర్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. దేవర సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని.. ఇంకా కొన్ని పాటలు చిత్రీకరణ జరగాల్సి ఉంది అంటూ జాన్వీకపూర్ చెప్పుకొచ్చింది. అయితే తెలుగు డైలాగులు స్క్రిప్ట్ తనకు అందిందని.. వాటిని నేర్చుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను అంటూ తెలిపింది. ఇక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తెలుగు డైలాగ్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. రానున్న కొన్ని రోజుల్లో నేను ఇంగ్లీష్ మాట్లాడకుండా కేవలం తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటున్నాను అంటూ జాన్వి కపూర్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: