రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గత ఏడాది సలార్ వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఆయన నటిస్తున్న చిత్రాల్లో కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో ఇప్పటికే స్టార్ హీరోలు నటిస్తున్నారు. అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో పాన్ ఇండియా హీరో కూడా భాగం కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...గత ఏడాది ప్రభాస్ ఆదిపురుష్, సలార్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ రెండు చిత్రాల్లో సలార్ సూపర్ హిట్టుగా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇదిలా ఉంటే.. ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు కల్కి ఒకటి కాగా.. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ మరొకటి. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రాజా సాబ్ నుంచి విడుదల అయిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే కల్కి సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా చిన్న కొమియో పాత్రలో కనిపిస్తారట. కాసేపు అలా తళుక్కున మెరుస్తారని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది.
అయితే ఈ విషయాన్ని ఈ మూవీకి స్క్రిప్ట్ రైటింగ్లో పనిచేస్తున్న(ఫ్రీలాన్స్ రైటర్) కేశవ చంద్ర హింట్ ఇవ్వడం విశేషం. ఆయన అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించారు. వారికి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. `కల్కి`లో ఎన్టీఆర్ కొమియో వార్తలపై సమాధానం చెప్పాలని వాళ్లు అడగ్గా ఆ విషయాన్ని మీరు సినిమాలోనే చూసి తెలుసుకోండి అని చెప్పారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన సినిమాకి సంబంధించిన క్రేజీ విషయాలను వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ని జరుపుకుంటోంది. ఆర్ఎఫ్సీలో షూట్ చేస్తున్నారట. ప్రభాస్, దిశా పటానీలపై ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ జరుగుతుందట. దీంతో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని తెలుస్తుంది.