ఆ విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్..!?

Anilkumar
శృతి హాసన్ ఆ మధ్య సినిమాలను గ్యాప్ ఇచ్చి.. ఇక ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్‌లో కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా డిసెంబర్ 22న భారీగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాతో శృతి హాసన్ 2023 సంవత్సరంలో నటించిన అన్ని  సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. పోయిన ఏడాది మొదట్లో శృతి హాసన్ వీరసింహారెడ్డి సినిమాతో పలకరించింది. ఆ తర్వాత మరుసటి రోజున సంక్రాంతికి వాల్తేరు వీరయ్య రిలీజ్ కాగా ఈ సినిమా కూడా భారీ హిట్ అయ్యింది.

దాదాపుగా 200 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఈ భామ నాని సరసన హాయ్ నాన్నలో చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక శృతి హాసన్ లేటెస్ట్ సినిమా సలార్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని గోల్డెన్ లెగ్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిపోయింది శృతి హాసన్.  తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమర్షియల్‌ చిత్రాలు, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఈ రెండింటిలో మీకు ఏది సంతృప్తిని ఇస్తుందన్న ప్రశ్నకు శృతీ స్పందిస్తూ.. 'మనం ఇంట్లో ఉన్నట్లు ఆఫీసులో ఉండలేం..

అలాగే అక్కడ ఉన్నట్లు ఇక్కడ ఉండలేం. ఇదే ల విషయంలోనూ వర్తిస్తుంది. నేనే ప్రధాన పాత్రలో నటిస్తున్నప్పుడు సెట్లో ఉండే అనుభవం ఒకలా ఉంటుంది. అలాగే ఇతర తారల చిత్రాల్లో భాగమైనప్పుడు కలిగే అనుభవం దానికి భిన్నంగా ఉంటుంది. అయితే ఈ రెండింటిలోనూ నా కష్టం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది నా చిత్రమైనా.. వేరే తారలతో తెర పంచుకుంటున్న అయినా నటిగా నా పాత్రకు న్యాయం చేసేందుకు నూటికి నూరు శాతం శ్రమపడతా' అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: