వావ్: పుట్టినరోజున ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి భార్య..!!
అత్తమ్మస్ కిచెన్ పేరుతో జాయింట్ ఆన్లైన్ బిజినెస్ ని కూడా ప్రారంభించారు. ఇది రెడీ టు ఈట్ ఫుడ్ బిజినెస్ అన్నట్టుగా ఉపాసన స్వయంగా తెలియజేయడం జరిగింది. తమ అత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా మా వ్యవస్థాపకు వెంచర్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందంటూ తెలిపింది. రుచికి రుచి వంటశాలలో వీటిని నిర్మిస్తున్నామంటూ ఇప్పుడు మా వంట గది నుండి మీ వద్దకు రెడీ మిక్స్ రూపంలో కొన్ని ఆహార ప్రాజెక్టులు కూడా వస్తాయని వీటిని మీ ఇంటిల్లి పాది తింటూ ఆస్వాదించండి అంటూ తెలియజేసింది..
Athammaskitchen.com అనే వెబ్సైట్లో తీసుకోవాలంటే తెలిపారు. ప్రస్తుతం ఉప్మా ,పొంగల్, పులిహోర, రసం ఈ నాలుగు ఉత్పత్తులను సైతం సేల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నాలుగు ప్యాకెట్ల ధర రూ.1099 రూపాయలుగా ఆన్లైన్లో డబ్బులు చెల్లించి పొందవచ్చు అంటూ తెలిపింది. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా తమ ఆహార ఉత్పత్తులను సైతం అందిస్తామంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఉపాసన ఒక వీడియో ద్వారా తెలియజేసింది. చిరంజీవి సతీమణి సురేఖ చేతి వంటలు తినడానికి మీరు సిద్ధంగా ఉండండి అంటూ తెలిపింది చిరంజీవి తల్లి అంజనమ్మ సురేఖతో సహా వారి కుటుంబంలో చాలామంది వంట నైపుణ్యంలో ప్రసిద్ధి చెందిన వారేనట. ఆహార ప్రియులకు మెగా ఫ్యామిలీ నుంచి అందించే ఈ రుచులపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.