మరోసారి ప్రభాస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి..!

Pulgam Srinivas
సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను చెబుతూ వారికి అనేక పూజలను చేయిస్తూ ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో వేణు స్వామి ఒకరు . ఈయన నటీ నటులకు సంబంధించిన జాతకాలను చెప్పడం మాత్రమే కాకుండా వారికి పూజలను కూడా చేయిస్తూ ఉంటాడు . అలాగే ఎప్పటి కప్పుడు ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ అనేక మంది సెల బ్రిటీలకు సంబంధించిన జాతకాల గురించి చెబుతూ వార్తల్లో వైరల్ అవుతూ ఉంటాడు . ఇక పోతే ఈయన గతంలో ప్రభాస్ కు సంబంధించి ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వాటితో ఈయన చాలా కాలం పాటు వైరల్ కూడా అయ్యాడు.

ది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ "కె సి ఆర్"  సీ ఎం అవుతాడు అని ఈయన చెప్పాడు. కానీ అలా జరగలేదు. దానితో ఈయన మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత మరికొన్ని విషయాలలో కూడా ఈయన చెప్పినవి జరగకపోవడంతో ఈయన ను చాలా మంది ట్రోల్ చేశారు. ఇకపోతే తాజాగా వేణు స్వామి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన మరోసారి ప్రభాస్ గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా వేణు స్వామి మాట్లాడుతూ ... ఆది పురుష్ మూవీ ఫ్లాప్ అన్నాను చెప్పినట్లే అయ్యింది. సలార్ మూవీ ని ఫ్యాన్స్ తప్ప ఎవరూ చూడరు అన్నాను ... అదే జరిగింది. భారతదేశంలో నా లాంటి మగాడు లేడు. ఇప్పుడు కూడా చెప్తున్నా ప్రభాస్ జాతకం బాగోలేదు అని ఈయన తాజా ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఇక తాజాగా వేణు స్వామి ... ప్రభాస్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: