రామ్ చరణ్ 17.. ఆ సంచలన దర్శకుడితో?

Anilkumar
గేమ్ ఛేంజర్' షూటింగ్ పూర్తి కాకముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కు సంబంధించి నెట్టింట రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గత రెండున్నరలుగా శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ జరుపుతూ వస్తున్నారు. కానీ సినిమా నుంచి ఒక్క అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ ని పట్టించుకోకుండా చరణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టారు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబుతో ఓ రూరల్ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని ఇప్పటికే న్యూస్ వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా సెట్స్ పైకి వెళ్ళకముందే రామ్ చరణ్ 17వ సినిమా గురించి

ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. బుచ్చిబాబు తర్వాత బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తో రామ్ చరణ్ ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లు ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ మధ్యన చరణ్ పలుమార్లు ముంబైకి వెళ్ళింది కూడా ఈ ప్రాజెక్ట్ గురించే అనే కామెంట్స్ వినిపించాయి. చరణ్ కంటే ముందు సంజయ్ లీలా బన్సాలీ అల్లు అర్జున్ తోనూ ఓ సినిమా ప్లాన్ చేసినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఆస్థానంలో ఇప్పుడు రామ్ చరణ్ వచ్చాడనేది లేటెస్ట్ బాలీవుడ్ మీడియా టాక్. కానీ దీనిపై కూడా ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. సంజయ్ లీలా బన్సాలీ అంటే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కి పెట్టింది పేరు.

ఇప్పుడు చరణ్ తో చేయబోయేది కూడా అలాంటి ప్రాజెక్ట్ అని అంటున్నారు. శ్రావస్టి సామ్రాజ్యానికి రాజు అయిన ఓ చక్రవర్తి తక్కువ మంది సైన్యంతో ఘాజీ సలార్ మసూద్ ని ఓడించి చంపడం గురించి సంజయ్ లీలా బన్సాలి దగ్గర చాలా కథలు ఉన్నాయట. వాటి ఆధారంగానే రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే రామ్ చరణ్ కి ప్రాజెక్ట్ బాలీవుడ్ లో సెన్సేషనల్ రీ ఎంట్రీ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న రామ్ చరణ్ ఎలాంటి విరామం తీసుకోకుండా వెంటనే బుచ్చిబాబు సినిమాతో బిజీ కానున్నారు. ఈ ప్రాజెక్టు కోసం చరణ్ నాన్ స్టాప్ డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: