పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. థియేటర్లో చెలరేగిన మంటలు?

Anilkumar
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల అభిమానులు చేసే పనులు ఇతరులకు చిరాకు తెప్పిస్తోంది. అభిమానం హద్దులు దాటితే తర్వాత జరిగే పరిణామాలను అంచనా వేయలేం. అభిమానం పేరిట కొంతమంది చేసే పనులు తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలను రీరిలీజ్ పేరుతో థియేటర్స్ లో ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఓ కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా రీ రిలీజ్ థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు అభిమానులు. పాలాభిషేకాలు, కొబ్బరికాయలు కొట్టడం, భారీ ప్లెక్సీ లు ఏర్పాటు చేయడం.. ఇక్కడి వరకు బాగానే ఉంది అని కొంతమంది ఫ్యాన్స్ అభిమానం పేరుతో థియేటర్స్ ధ్వంసం చేయడం,

అద్దాలు పగలగొట్టడం, ఏకంగా థియేటర్లో బాణ సంచనాలు కాల్చడం లాంటివి చేస్తున్నారు. స్క్రీన్స్ చించేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఈమధ్య థియేటర్ యాజమాన్యం రీ రిలీజ్ సినిమాలను నిలిపివేశారు. రీసెంట్ గా 'జల్సా' సినిమా రీ రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ ధ్వంసం చేశారు. అక్కడ సౌండ్ సరిగా రావట్లేదని పెంచమంటే థియేటర్ యాజమాన్యం సరిగా స్పందించలేదని థియేటర్ ధ్వంసం చేశారు. ఇక ఇప్పుడు మరోసారి అదే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆంద్రప్రదేశ్ లోని ఓ థియేటర్లో  ఏకంగా మంటలు పెట్టారు. పవన్ కళ్యాణ్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' మూవీ రీరిలీజ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

'కెమెరామెన్ గంగతో రాంబాబు' రీ రిలీజ్ సందర్భంగా కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో థియేటర్లో చిత్తుకాగితాలను దగ్గరకు చేసి వాటికి నిప్పంటించి ఆ మంటల్లోనే ఎగురుతూ నానా రచ్చ చేశారు. అక్కడితో ఆగకుండా ఆ మంటలను మరింత పెంచేందుకు చిత్తు కాగితాలను అందులోకి విసిరి మంటలు మరింత పెంచే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా అంతట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ లోపల ఇలా మంటలు పెట్టడం కరెక్ట్ కాదని, అభిమానం పేరుతో కొందరు ఇలా చేస్తున్నారని, వీలైనంత త్వరగా ఈ రీ రిలీజ్ ట్రెండ్ ని ఆపేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: