'KGF' రూట్ లోనే 'పుష్ప' కూడా?

Anilkumar
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప: ది రైజ్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ మూవీకి భారీ ఆదరణ దక్కింది. దాంతో అల్లు అర్జున్ క్రేజ్ ఇండియా స్థాయికి చేరింది. పార్ట్-1 అనూహ్య రీతిలో విజయం సాధించడంతో 'పుష్ప 2' ని మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న 'పుష్ప 2' ఓ విషయంలో మాత్రం 'కేజిఎఫ్' మూవీ స్ట్రాటజీని ఫాలో అవుతోంది. 'కే జి ఎఫ్' పార్ట్ వన్ లాగే పుష్ప పార్ట్- 1 అన్ని భాషల్లో మంచి సక్సెస్ అందుకుంది. 2022 లో 'కే జి ఎఫ్' కి కొనసాగింపుగా వచ్చిన 'కే జి ఎఫ్- 2' బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 1000 కోట్లు కొల్లగొట్టింది.

ఇక త్వరలో రాబోయే 'పుష్ప 2' కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు₹ అయితే 'కేజిఎఫ్' లాగే 'పుష్ప' మూవీని కూడా ఓ ఫ్రాంచైజీలా ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. 'కేజీఎఫ్ 2'కి కొనసాగింపుగా 'కేజిఎఫ్-3' ఎలాగైతే ప్లాన్ చేస్తున్నారో ఇప్పుడు 'పుష్ప' పార్ట్-3ని కూడా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'పుష్ప 2' తోనే కథను ముగించకుండా 'పార్ట్-3' కూడా ఉంటుందట. కానీ ఈ ప్రాజెక్టు వెంటనే స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. 'పుష్ప 2' క్లైమాక్స్ లోనే పార్ట్-3 కి సంబంధించిన హింట్ ఉంటుందని మూవీ టీం చెబుతోంది. కానీ పార్ట్-3 వెంటనే స్టార్ట్ అయ్యే అవకాశం లేదట. కేజీఎఫ్ 3 లాగే 'పుష్ప 3' మొదలవడానికి కొన్ని

సంవత్సరాలు టైం పడుతుందని అంటున్నారు. 'కేజిఎఫ్ 2'  సంచలన విజయం అందుకోవడంతో పార్ట్ 3 పై తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే యశ్ మాత్రం ప్రజెంట్ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' అనే సినిమా చేస్తున్నాడు. సేమ్ బన్నీ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవ్వనున్నట్లు తెలుస్తోంది. 'పుష్ప 2' తర్వాత బన్నీ లైనప్ లో త్రివిక్రమ్, అట్లీ, బోయపాటి లాంటి డైరెక్టర్స్ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తవ్వడానికి కనీసం మూడేళ్లు పట్టొచ్చు. ఆ తర్వాతే 'పుష్ప పార్ట్-3' సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక 'పుష్ప 2' విషయానికొస్తే దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: