'యాత్ర 2'.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన డైరెక్టర్?

Anilkumar
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన యాత్ర సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ ని అందుకుందో తెలిసిందే. మహి. వి రాఘవ దర్శకత్వ వహించిన ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గా కనిపించి అద్భుతమైన నటన కనబరిచారు. పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ గా 'యాత్ర వ్2' వస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో వైయస్సార్ తో పాటు ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని చూపించబోతున్నారు. 2009 నుంచి 2019 వర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కోలీవుడ్ హీరో జీవా వైయస్ జగన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే 'యాత్ర 2'కు సంబంధించి మోషన్ పోస్టర్, మమ్ముట్టి, జీవా ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగ5ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. ఫిబ్రవరి 8న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. రిలీజ్ టైం దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే 'యాత్ర 2' ప్రమోషన్స్ లో భాగంగా తాజా ప్రెస్ మీట్ లో డైరెక్టర్ మహి వి రాఘవ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తాజా ప్రెస్ మీట్ లో మహీ.వి  రాఘవ మాట్లాడుతూ.." రాజకీయం గానీ రాజకీయ నాయకుల గురించి గానీ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు చేసినప్పుడు గాని రాళ్లు వేసే వాళ్ళు రాళ్లు వేస్తారు. బురద వేసే వాళ్లు బురద వేస్తారు. ఇప్పుడు నాకు ఆ రాళ్లు ఎత్తే ఓపిక లేదు, బురద తుడుచుకునే ఓపిక లేదు.. దట్స్ నాట్ మై జాబ్" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఈ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: