స్టార్ హీరోలతో ఇబ్బందులు.. త్రివిక్రమ్ షాకింగ్ డెసిషన్?

Anilkumar
టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రచయితగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఆ తర్వాత దర్శకుడిగా తన క్లాస్ రైటింగ్, ఫిలిం మేకింగ్ తో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. అలాంటి ఈ దర్శకుడు తాజాగా మహేష్ బాబు తో  'గుంటూరు కారం' సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ నిరాశపరిచింది. ముఖ్యంగా సినిమా చూసిన ఎక్కువ శాతం ఆడియన్స్ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని బాహాటంగానే అన్నారు. దీంతో సినిమా రిలీజ్ తర్వాత ఆయనపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

అయితే ఇటీవల కాలంలో త్రివిక్రమ్ తన సినిమాల సమయంలో జరిగిన సంఘటనలు తనను చాలా బాధించాయని చెబుతున్నారు. త్రివిక్రమ్ కి ఇబ్బందులు వచ్చేది ఎక్కువగా స్టార్ హీరోల దగ్గర నుంచేనట. నిజానికి స్టార్ హీరోలు సినిమాకి కమిట్ అయ్యే ముందు పెద్దగా అభ్యంతరాలు చెప్పరు. కానీ సినిమా కమిట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి చాలా అభ్యంతరాలు వస్తున్నాయి. ఫలితంగా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి క్రియేటివ్ ఇష్యూస్ వల్ల కొన్ని సినిమాలు ఏకంగా రద్దు చేయబడుతున్నాయి. ఇటీవల త్రివిక్రమ్ కూడా ఇదే సమస్యను ఎదుర్కోవడంతో ఇప్పటినుంచి తనకు కంప్లీట్ క్రియేటివ్ ఫ్రీడమ్

ఉన్నచోటే పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఒక్కసారి సినిమాకి కమిట్ అయ్యాక స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదు అనేది ఆయన కోరిక. పవన్ కళ్యాణ్ దగ్గర త్రివిక్రమ్ కి ఇలాంటి విషయాల్లో ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలనుకోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే అయి ఉండొచ్చు అని అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి రాజకీయాలతో బిజీ అవ్వడం ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు ఉండడంతో త్రివిక్రమ్ ప్రస్తుతానికి ఓ మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్నారట. వాళ్లతో అయితే ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోరు. మరి ఆ మీడియం రేంజ్ హీరో ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: