ఊహించని బడ్జెట్ తో 'సార్పట్ట' సీక్వెల్.. !

Anilkumar
కబాలి' డైరెక్టర్ పా. రంజిత్ నుండి కరోనా టైమ్ లో వచ్చిన సినిమా 'సార్పట్ట'. తమిళ హీరో ఆర్య లీడ్ రోల్ లో నటించిన ఈ పీరియాడిక్ బాక్సింగ్ డ్రామా ఓటీటీలో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. థియేటర్‌ రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా వంద కోట్లు రాబట్టేదని అప్పట్లోనే టాక్ వచ్చింది. 2021లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమా’ ఓటీటీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు విమర్శకులు, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తమిళంతో పాటు తెలుగు లోనూ ఈ సినిమాకి భారీ స్పందన లభించింది. తమిళనాడులో జరిగే స్ట్రీట్ బాక్సింగ్ టోర్నమెంట్‌ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు. 'సార్పాట్ట రౌండ్ 2' పేరిట ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు పా. రంజిత్‌నే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ఇంకా ప్రకటించలేదు. కానీ దాదాపుగా మొదటి భాగంలో నటించిన తారాగణమే కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం విక్రమ్ హీరోగా పా. రంజిత్ తెరకెక్కిస్తున్న 'తంగలాన్' మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది.

ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో చేయబోతున్నారు. ఇక 'తంగలాన్' రిలీజ్ తర్వాత డైరెక్టర్ రంజిత్ 'సార్పట్టా పరంపర 2' ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇక తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికర అప్డేట్స్ బయటికి వచ్చాయి. డైరెక్టర్ పా. రంజిత్ సార్ పట్టా సీక్వెల్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేశారట. మొదటి భాగం కంటే మరింత ఎక్కువ బడ్జెట్ తో సీక్వెల్ ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 'సార్పట్టా' సీక్వెల్ కోసం ఏకంగా 100 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నట్లు తాజా సమాచారం. గ్రాండ్ స్కేల్లో రూపొందునున్న ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. జూన్ లేదా జూలై లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: