'యానిమల్'.. ఓటీటీ లోనూ రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్!

Anilkumar
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన 'యానిమల్' మూవీ గత ఏడాది డిసెంబర్లో విడుదల ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్, నేషనల్ రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు రూ. 915 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. థియేటర్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోనూ అదరగొడుతుంది. జనవరి 26 న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'యానిమల్' 

కేవలం మూడు రోజుల్లోనే 20 మిలియన్ గంటలకు పైగా వీక్షణలతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. వ్యూస్ పరంగా చూసుకుంటే 6 మిలియన్ల 2 లక్షల వ్యూస్ తో ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీకి దక్కని అరుదైన ఘనతని సొంతం చేసుకుంది. అప్పటివరకు నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న ప్రభాస్ 'సలార్' యానిమల్ దెబ్బతో మూడో స్థానానికి పడిపోయింది. ఇక ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్స్ సైతం టాప్-10 లిస్ట్ నుంచి తప్పుకున్నాయి. ఈ నంబర్స్ అన్నీ కేవలం నెట్ ఫ్లిక్స్ లో అధికారికంగా చూసినవే కావడం విశేషం. ఓటీటీలో 'యానిమల్' హవా మరి కొన్ని వారాల పాటు కొనసాగేలా కనిపిస్తోంది. థియేటర్స్ లో ఈ సినిమాని మిస్

 అయిన ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలో ఎగబడి మరీ చూస్తున్నారు. సినిమాపై విమర్శలు ఇప్పటికీ ఏమాత్రం ఆగలేదు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విమర్శలపై స్పందించడం మానేశారు. ఓటీటీలో 'యానిమల్' మేనియా ఏ రేంజ్ లో ఉందంటే ఈ సినిమాలో రణబీర్ కపూర్ అనిల్ కపూర్ ని 'పప్పా' అని ఎన్నిసార్లు పిలిచాడో నంబర్స్ తో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సినిమా మొత్తంలో రణ్బీర్ కపూర్ 'పప్పా' అని 196 సార్లు ఉచ్చరించాడని ఓ అభిమాని వీడియో ప్రూఫ్ తో సహా సోషల్ మీడియాలో పెట్టేసరికి ఆ వీడియోని స్వయంగా ఇక నిర్మాణ సంస్థ పోస్ట్  చేసింది. ఆ రేంజ్ లో యానిమల్ మ్యానియా గా నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: