మళ్లీ అలాంటి సినిమా చేయడానికి రిస్క్ చేస్తున్న అల్లు అర్జున్..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన బద్రీనాథ్ సినిమా ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటివరకు అలాంటి సినిమా చేసే ప్రయత్నం చేయలేదు అల్లు అర్జున్. అలాంటి సినిమా చేయడానికి కూడా భయపడుతున్నట్లుగా తెలుస్తోంది .ఈ క్రమంలో తాజాగా అటువంటి కథాంశం తో పూర్తిగా డివోషనల్ టచ్ తో ఒక సినిమా చేయాలి అని అల్లు అర్జున్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ఇక అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి ఒక స్టార్ డైరెక్టర్ ఈ సినిమాను తీస్తున్నారట. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే ఈ విషయంపై అల్లు అర్జున్ తో చర్చలను కూడా జరిపినట్లుగా సమాచారం. సాధారణంగా ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా డివోషనల్ టచ్ తోనే ఎక్కువగా వస్తున్నాయి. అలా వచ్చిన సినిమాల్లో హనుమాన్ సినిమా కూడా ఒకటి. ఇక హనుమాన్ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చారిత్రక నేపథ్యం డివోషనల్ టచ్ ఇటువంటి సినిమాలకి ప్రస్తుతం భారీ క్రేజ్ ఉంది. దాంతో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్   ఈసారి కాస్త రిస్క్

 తీసుకునే అవకాశాల్లేకపోలేదు. ప్రస్తుతానికైతే 'పుష్ప-2' సినిమా పనుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  చాలా చాలా బిజీగా వున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  నుంచి రాబోయే రెండు మూడు సినిమాలకు ఒప్పందాలూ జరిగిపోయాయ్. ఏమో, ఏమైనా జరగొచ్చు.. ట్రెండ్‌ని క్యాష్ చేసుకోవాలనుకుంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినా ఇవ్వొచ్చు. ఎవరా యంగ్ డైరెక్టర్.? ఏంటా నిర్మాణ సంస్థ.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: