'గుంటూరు కారం' నుంచి మరో ట్రాక్

Anilkumar
త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 'గుంటూరు కారం' ఈ సంక్రాంతికి విడుదలై డివైడ్ టాక్ తోనే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.230కోట్ల గ్రాస్ అందుకొని ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మహేష్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా మరో పాటను ఎస్.ఎస్ తమన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తమన్ స్వయంగా   వెల్లడించారు. రిలీజ్ కు ముందు 'గుంటూరు కారం' కోసం తమన్ కంపోజ్ చేసిన చేసిన సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ముఖ్యంగా దమ్ మసాలా, కుర్చీ మడత పెట్టి వంటి పాటలు మహేష్ ఫ్యాన్స్ ని ఫలితంగా ఆకట్టుకున్నాయి.

 విజువల్ గానూ థియేటర్స్ లో ఫ్యాన్స్ కి మంచి ఊపు తెప్పించాయి. ఇక ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కోసం మరో సాంగ్ ని థమన్ రెడీ చేస్తున్నారు 
"గుంటూరు కారం ఆరు ట్రాక్ లతో పాటూ మహేష్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా మరో పాటని యాడ్ చేయబోతున్నాం. ఈ సాంగ్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఎంతో స్పెషల్ గా ఉంటుంది. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ.. ఇదే నా ప్రామిస్" అంటూ   పేర్కొన్నాడు.  మహేష్ ఫ్యాన్స్ ఆ సాంగ్ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.'గుంటూరు కారం' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్. ఎస్ రాజమౌళితో ఓ భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. మహేష్, రాజమౌళి ఇద్దరూ ఓ సినిమా కోసం మొదటిసారి చేతులు

 కలపడంతో ఈ ప్రాజెక్టు పై ఆది నుంచే అంచనాలు మొదలైపోయాయి. 'SSMB29' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రానికి సంబంధించి రీసెంట్ గానే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక మహేష్ బాబు సైతం ఈ ప్రాజెక్టు వర్క్ షాప్ కోసం జర్మనీ వెళ్ళాడు. అక్కడ ఓ ఫిజియో ఎక్స్పర్ట్ దగ్గర ట్రైనింగ్ తీసుకోబోతున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగనున్న అడ్వెంచర్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. ఇక ఈ ఏడాది ఉగాది పండగ సందర్భంగా ఏప్రిల్ 9న ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: