పాపం.. బాలయ్య అఖండ సీక్వెల్ కి సమస్యలు..!?

Anilkumar
2021 లో విడుదలైన అఖండ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ బోయపాటి ఇద్దరు బాక్సాఫీస్ ని షేక్ చేశారు. అంతేకాదు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా అప్పట్లో 70 కోట్ల రూపాయలకు పైగానే షేర్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక బాలయ్య అభిమానులకు ఈ సినిమా ఒక పండగే అని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే అఖండ సినిమాకి సీక్వెల్ రాబోతోంది అని చెప్పడంతో  బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు.

అయితే అఖండ సినిమాకి మిరియాల రవీందర్ రెడ్డి కారణంతో ఆ నిర్మాత నుండి అఖండ సీక్వెల్ కోసం సంబంధించిన క్లియరెన్స్ రావాల్సి ఉంది అని అందుకే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన బయట పెట్టలేదు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ విషయంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఇన్ని ఇబ్బందుల మధ్య ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. తన డైరెక్షన్ లో తెరకెక్కే ప్రతి సినిమా 100 కోట్ల రూపాయల కంటే

 ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుందని ఇప్పటికే బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చేశారు.బోయపాటి శ్రీను భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం భారీ రేంజ్ లో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది. బోయపాటి శ్రీను పారితోషికం ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. బోయపాటి శ్రీను భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలయ్య తన తదుపరి సినిమాతో బిజీగా ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: