ఆ కారణంగానే అక్కడికి వెళ్ళలేదంటున్న కలెక్షన్ కింగ్...!!

murali krishna
హిందువుల నమ్మకం, కల అయినటు వంటి అయోధ్య రామ మందిర  ఏర్పాట్లు పూర్తయిన సంగతి మనకు తెలిసిందే. ఈనెల 22వ తేదీ ఆయోధ్య లోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవం గా జరగబోతుంది.ఇక ఈ వేడుకను కన్నులారా చూడడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతృత గా ఎదురు చూస్తున్నారు. ఇక అయోధ్య రామ మందిర ఏర్పాటు కార్యక్ర మాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పటికే రామ మందిరం ట్రస్ట్ వారు ఎంతో మంది సీనియర్ సెలబ్రిటీ లను రాజకీయ నాయకులను వ్యాపారవేత్త లను కలిసి స్వయంగా ఆహ్వాన పత్రిక ను అందజేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్ వంటి వారంద రికీ కూడా అయోధ్య ఆహ్వానం అందింది అయితే మోహన్ బాబు ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించ లేదా అన్న సందేహాలు కూడా అందరికీ కలిగాయి. ఈ క్రమం లోనే అయోధ్య ఆహ్వానం విషయం లో మోహన్ బాబు స్పందించారు తనకు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందిందని ఈయన తెలిపారు.  ఈ విధంగా మోహన్ బాబు స్పందిస్తూ తన కి కూడా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానం అందిందని అంతే కాకుండా తమ ఫ్యామిలీకి ప్రత్యేకం గా సెక్యూరిటీ కూడా కల్పిస్తామని చెప్పారు. కానీ తాము భయపడి ఈ ఆలయ ప్రారంభోత్స వానికి వెళ్లడం లేదని మోహన్ బాబు తెలిపారు. ఇలా అయోధ్య వెళ్లక పోయినా ఇక్కడ దైవ సన్నిధి లో ఈ నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అనేక పూజా కార్య క్రమాలను చేస్తున్నాము అంటూ ఈ సందర్భం గా మోహన్ బాబు చేసినటు వంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: