27 ఏళ్ళ వయసులో మొదలు పెడితే.. 50 ఏళ్లకు. దక్కింది.. శివాజీ కామెంట్స్ వైరల్?

praveen
నటుడు శివాజీ గత కొంతకాలం నుంచి టాలీవుడ్ లో ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉన్నాడు. ఇక యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అతని ఇంటర్వ్యూలే దర్శనమిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు బిగ్ బాస్ అనే షో ద్వారా వార్తల్లో నిలిచిన శివాజీ ఇక ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ లలో నటించడం ఇక ఆ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో ఇక హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి. అయితే ఒకప్పుడు తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న శివాజీ ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు.

 దీంతో శివాజీ గురించి సొంత అభిమానులే మరిచిపోతున్న సమయంలో ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ షోలో ప్రత్యక్షమయ్యాడు. తన ఆట తీరుతో తెలుగు ప్రజల చేత శివన్న అని పిలిపించుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే శివాజీ ఇటీవల తన కెరీర్ గురించి చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. కాగా ఇటీవల శివాజీ చేతుల మీదుగా మార్కెట్ మహాలక్ష్మి అనే కొత్త సినిమా టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శివాజీ. మనలో విషయం ఉండాలే కానీ కళామతల్లి ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తుంది అంటూ శివాజీ చెప్పుకొచ్చాడు.

 ఇక లక్ష్యం చేరుకునే వరకు త్రికరణ శుద్ధితో పనిచేస్తూ ఉండాలి అంటూ తెలిపాడు. తాను 27 ఏళ్ల వయసులో యాక్టింగ్ ని మొదలుపెడితే 50 ఏళ్ల వయసులో గుర్తింపు వచ్చింది అంటూ తెలిపాడు. అలాగే ఇండస్ట్రీలో ఎదగాలంటే క్యారెక్టర్, హార్డ్ వర్క్, ఓపిక ఎంతో ముఖ్యం అంటూ తెలిపాడు శివాజీ.  ఇక మార్కెట్ మహాలక్ష్మి మూవీ కూడా విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు శివాజీ. కాగా కేరింత ఫ్రేమ్ పార్వతీశం హీరోగా మార్కెట్ మహాలక్ష్మి సినిమా రాబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: