స్టార్ ప్రొడ్యూసర్ అల్లుడితో రొమాన్స్ చేయనున్న వైష్ణవి చైతన్య....!!

murali krishna
బేబీ సినిమాతో టాలీవుడ్ సెన్షెషన్ గా మారిన నటి వైష్ణవి చైతన్య. ఒక్క సినిమాలోనే అన్ని వేరియేషన్స్ చూపించి ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.ఈమె నటనకు ప్రముఖుల ప్రశంసలు సైతం లభించాయి. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడు నటనకు ఫిదా అయ్యారు. దీంతో వైష్ణవికి మూవీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. బేబీ తర్వాత ఆనంద్ దేవకొండతో మరో సినిమా చేస్తుంది. దీంతో పాటు మరో సినిమాకు కూడా ఓకే చెప్పిందట వైష్ణవి. టాప్ ప్రొడ్యూసర్ దిల్‍రాజు అల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న సినిమాలో వైష్ణవి హీరోయిన్‍గా ఎంపికయ్యిందట. రౌడీ బాయ్స్' సినిమాతో ఆశిష్ రెడ్డి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ఆశిష్ రెడ్డి మరో లవ్ స్టోరీకి ఓకె చెప్పాడట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వైష్ణవి ఫీమేల్ లీడ్ లో నటించబోతుందట. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆశిష్ రెడ్డి - వైష్ణవి కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు టైటిల్‍ కూడా ఫిక్స్ చేశారట. దీనికి 'లవ్ మీ' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 'సాప్ట్ వేర్ డెవలపర్' షార్ట్ ఫిలింతో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బేబీ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ ఆశ్విన్, వైష్ణవి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమాకు యూత్ కనెక్ట్ అయ్యారు. దీంతో వైష్ణవి నటనకు ప్రశంసలు లభించాయి. వైష్ణవి నెక్ట్స్ నటించబోయే రెండు సినిమాలు కూడా ప్రేమ కథలే కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: