దర్శకుడి పోస్ట్.. పదేళ్ల తర్వాత రిప్లై ఇచ్చిన త్రిష?

praveen
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది త్రిష. ఒకప్పుడు దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో హవా నడిపించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడినప్పటికీ వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూనే ఉంది. ఇక భారీగా పారితోషకం అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతుంది త్రిష. అయితే ఇటీవల  పోనియన్ సెల్వన్ అనే సినిమాతో సూపర్ హిట్ను ఖాతాలో వేసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక త్రిష కెరియర్ లో ఇలా ప్రేక్షకులకు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచే సినిమాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే త్రిష అటు తెలుగులో కూడా అందరి హీరోలతో జోడి కట్టి సూపర్ హిట్లను ఖాతాలో వేసుకుంది. అయితే ఇలా త్రిష పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు కొన్ని సినిమాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలలో వెంకటేష్ హీరోగా నటించిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమా కూడా ఒకటి అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో అటు త్రిష తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బాగా దగ్గర అయింది అని చెప్పాలి. సెల్వ రాఘవ దర్శకత్వంలో. వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 అయితే ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సినిమాకు సీక్వల్ తీయాలని అనుకున్నాడు దర్శకుడు సెల్వ రాఘవన్.  2013లో సీక్వల్ తీయాలి అనుకుంటున్నాను అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. అయితే అప్పుడు త్రిష ఈ పోస్టు చూసి చూడనట్లుగానే వదిలేసింది. కానీ ఇప్పుడు పదేళ్ల తర్వాత అప్పుడు దర్శకుడు పెట్టిన పోస్ట్ కి రిప్లై ఇచ్చింది. నేను కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో పదేళ్ల తర్వాత మళ్లీ హిట్ మూవీ లోడింగ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రిప్లై ఇవ్వడం విషయంలో మరి ఇంత లేట్ ఏంటి మేడం అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: