అక్కడ దర్శనం ఇచ్చి కెమెరాకి చిక్కిన మెగా పవర్ స్టార్ రాంచరణ్....!!
వచ్చే ఏడాది స్టార్టింగ్ లో కాని.. సమ్మర్ లో కాని ఈమూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత దిల్ రాజు. అయితే చరణ్ తన ఫ్యామిలీ కోసం ఓమూడు నెలలు గ్యాప్ తీసుకోవడంతో.. గేమ్ ఛేంజర్ షూటింగ్ కు లాంగ్ బ్రేక్ పడింది. అయితే ఈగ్యాప్ లో శంకర్ ఇండియాన్ 2 సినిమాను కంప్లీట్ చేశాడు. రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ ను పరులుగు పెట్టిస్తున్నాడు. తన పూర్తి టైమ్ ను ఈసినిమా కోసమే కేటాయిస్తున్న చరణ్... తాజాగా షూటింగ్ కోసం వెళుతూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరాల కంటబడ్డాడు.
కంప్లీట్ బ్లాక్ డ్రస్ లో మెరిసిపోతున్నాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ స్టార్. తనకిష్టమైన బ్లాక్ డ్రస్ లో రామ్ చరణ్ లాంజ్ లోకి వెళుతూ దర్శనమిచ్చాడు. చేతిలో ల్యాపీ బ్యాగ్, కళ్లకు గాగుల్స్ తో ఉన్న రామ్ చరణ్... మీడియాను చూస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. మీడియాను పలకరిస్తూ.. లోపలికి వెళ్లాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమూవీ షూటింగ్ కోసమే రామ్ చరణ్ వెళ్లినట్టు సమాచారం. మరి ఎక్కడికి వెళ్ళాడు అనేది మాత్రం క్లారిటీ లేదు.
ఇక భారీ బడ్జెట్ తో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ తో గతంలో వినయ విధేయ రామ సినిమాలో నటించింది బ్యూటీ. రెండో సారి నటిస్తోంది. ఇక ఈమూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈసినిమాలో ఈ ఇద్దరు స్టార్లతో పాటు.. అంజలీ, సునిల్, శ్రీకాంత్. జయరాం లాంటి స్టార్ కాస్ట్ దర్శనం ఇవ్వబోతున్నారు.