ఓటిటిలోకి వస్తున్న మేమ్ ఫేమస్.. చిత్రం..!!

Divya
సుమంత్ ప్రభాస్ హీరోగా తానే సొంతగా దర్శకత్వం చేసిన చిత్రం మేమ్ ఫేమస్.. ఊరిలో పని పాట లేకుండా బలాదురుగా తిరిగి ముగ్గురు కుర్రాళ్ళ కథ గురించి ఈ సినిమాని తెరకెక్కించారు. చివరికి వీరు ఎలా పాపులారిటీ సంపాదించారనే విషయమే ఈ కథ చిత్రం.. మనీ ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, కిరణ్ మచ అంజి తదితరులు ప్రధాన పాత్రలు నటించారు. ఈ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా చిత్రీకరించడం జరిగింది.మే 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో ఆకట్టుకుంది. కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓటీటి లో సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో మేము ఫేమస్ సినిమా ఈ రోజున స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మే 26 న విడుదలైన ఈ చిత్రం నెల రోజుల లోపే ఓటీటి లోకి వచ్చేయడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూడడానికి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు సైతం మెచ్చుకోవడం జరిగింది. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, రైటర్ పద్మభూషణ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న లహరి ఫిలిం బ్యానర్లపైన తెరకెక్కించారు.

సుమంత్ ప్రభాస్ ఈ సినిమా కథ స్క్రీన్  ప్లే డైలాగులు అందించడంతో దర్శకత్వం కూడా అతని వహించారు.ఈ సినిమా తో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేము ఫేమస్ సినిమా సంబంధించి ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది. థియేటర్లో మెప్పించిన ఈ చిత్రం ఓటిటి ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: