ఒకే స్టోరీ లైన్ తో వచ్చి హిట్స్ కొట్టిన తండ్రి కొడుకులు....!!
2015 ఆగస్టు 7న విడుదలైన శ్రీమంతుడు చిత్రం ఘన విజయం సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో హీరో తండ్రి సొంత ఊరుపై కోపంతో వలసొచ్చి కోట్లు సంపాదిస్తాడు. సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్గా ఎదగుతాడు. సిటీలో పెరిగిన హీరో తన సొంత ఊరికి చెందిన హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆమె కోసం తన సొంత ఊరికి వెళ్తాడు.
సొంత ఊరును దత్తత తీసుకుని బాగుచేయడం ప్రారంభిస్తాడు. అలాగే అక్కడ ఎంపీ సోదరులు చేసే అక్రమాలను ఎదిరించి.. ఊరికి పట్టిన పీడను వదిలిస్తాడు. ఇదే శ్రీమంతుడు కథ. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఇదే కథతో కొన్నాళ్ల క్రితం మహేష్ బాబు తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ ఓ మూవీ చేశాడు. అదే `రామరాజ్యంలో భీమరాజు`. ఎ. కోదండరామి రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించారు... ఇందులో కృష్ణ, శ్రీదేవి జంటగా నటించారు. అయితే ఈ మూవీ కథ కూడా ఇంచుమించు శ్రీమంతుడు మాదిరే ఉంటుంది. కోట్లకు వారసుడు అయిన హీరో.. విలన్లు బారిన నుంచి ఓ గ్రామాన్ని, అక్కడి ప్రజలను రక్షిస్తాడు. అదే ఊరికి చెందిన హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. 1983లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇంకా చెప్పాలంటే రామరాజ్యంలో భీమరాజు సినిమాకు శ్రీమంతుడు కాపీ మాదిరి ఉంటుంది. ఏదేమైనా ఒకే కథతో వచ్చి తండ్రీకొడుకులిద్దరూ సూపర్ హిట్ కొట్టడం విశేషం.ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ, మహేష్ బాబు కాంబో లో వచ్చిన మరో మూవీ భరత్ అనే నేను..ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.