ఆదిపురుష్: ఫేక్ వార్తలకు చెక్ పెట్టిన మేకర్స్?
ఇక ఆది పురుష్ ప్రదర్శిచే థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీటును ఖాళీగా ఉంచనున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే దీనిపై కూడా కొంతమంది మాత్రం నెగెటివ్ రూమర్స్ క్రియేట్ చేశారు. ఇక ఆదిపురుష్ మూవీ యూనిట్ హనుమంతుడి ప్రత్యేకంగా సీట్ కేటాయిస్తోంది భక్తితో కాదని.. దానిని కూడా వారు క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం బాగా ఊపందుకుంది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న ఈ సీటు పక్కనున్న సీటు కోసం థియేటర్లు భారీ మొత్తంలో వసూలు చేస్తున్నాయని గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.ఇక మరికొందరు ఖాళీ సీట్ల పక్కనే ఉన్న సీట్లకు టిక్కెట్లు కొని బ్లాక్లలో పెట్టి భారీ మొత్తానికి విక్రయిస్తున్నారనే కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఆదిపురుష్ టీమ్ స్పందించింది. 'ఆదిపురుష్ టిక్కెట్ ధరలపై మీడియాలో ఇంకా సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే కథనాలు వస్తున్నాయి. హనుమంతుడికి రిజర్వు చేసిన పక్కనే ఉన్న సీట్ల ధరల్లో అసలు ఎలాంటి తేడా లేదని, మిగతా సీట్ల లాగానే వాటి ధర ఉంటుందని స్పష్టం చేస్తున్నాం. దయచేసి ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దు.'అని ఆదిపురుష్ మూవీ నిర్మాణ సంస్థ టీ- సిరీస్ ట్వీట్ చేసింది.