టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేనికి ఇప్పటి వరకు తన హైప్ కి తగ్గ హిట్ పడలేడు. చివరగా నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` సినిమా మాత్రం ఏదో జస్ట్ హిట్ గా అనిపించుకుంది. కానీ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అఖిల్.అందుకే ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాతో తన లక్ టెస్ట్ చేసుకోవడానికి వస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` సినిమా చేస్తున్నాడు. మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అఖిల్ కి జోడీగా కొత్త హీరోయిన్ సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుంది. ఏకే ఎంటర్టైనర్మెంట్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మిస్తున్న పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రమిది. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ప్రస్తుతం భారీ యాక్షన్, ఛేజింగ్ సీన్లని షూటింగ్ చేసేందుకు ఫారెన్ వెళ్తున్నారు. ఇక సినిమా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల కాబోతుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కింది. దాదాపు నలభై కోట్ల బడ్జెట్తో ప్రారంభమైన ఈ సినిమాకి సుమారు ఎనభై కోట్లు ఖర్చు అయ్యిందట.
భారీ యాక్షన్ ఎపిసోడ్ల వల్ల బడ్జెట్ పెరిగిందని సమాచారం తెలుస్తుంది. అఖిల్ పై ఇంత బడ్జెట్ అంటే చాలా పెద్ద రిస్కే. అది రికవరీ అతవుతుందా అనేది కూడా పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే విడుదలైన టీజర్ కూడా చాలా ఆకట్టుకుంది. రీసెంట్ గా రిలీజ్ ప్రోమోలో బిన్ లాడెన్, గడాఫి, హిట్లర్ పంపారంటూ అఖిల్ చెప్పే డైలాగ్ పిచ్చ పిచ్చగా ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెరిగాయి.ఇంకా దీనికితోడు ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా హిట్ అయితే కలెక్షన్లు మాత్రం పెద్ద లెక్క కాదు, కానీ తేడా కొడితేనే ఏమవుతుందో అనేదే చాలా పెద్ద ప్రశ్న. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా అమ్ముడు పోయాయట. వైజాగ్కి చెందిన గాయత్రి ఫిల్మ్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాలు ఇంకా అలాగే కర్నాటక హక్కులను సొంతం చేసుకున్నారట. ఏకంగా రూ.34కోట్లకు ఈ మూడు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నట్టు సమాచారం తెలుస్తుంది.