ఆ సంవత్సరం తలుచుకుంటే భయం వేస్తుంది : శృతి హాసన్

murali krishna
యూనివర్సల్ నటుడు అయిన కమల్ హాసన్ వారసురాలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా  అయితే పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన శృతిహాసన్ టాలీవుడ్ లో హీరోయిన్గా మంచి గుర్తింపును సంపాదించింది.
అనగనగా ఒక ధీరుడు సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా టాలీవుడ్ లో తనకంటూ స్టార్ గుర్తింపు ను ఏర్పరచుకుంది. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైన శృతిహాసన్ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ద్వారా మళ్ళీ రీఎంట్రీ ను ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది.
ఇక ఇటీవల చిరంజీవి బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల సరసన నటించి ఒకేసారి రెండు సినిమాలతో కూడా మంచి విజయాలు అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాలలో నటించి మంచి హిట్స్ అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్న శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ పంచుకుంటూ ఉంటుంది. తాజాగా గతంలో తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2012 లో తనకు ఎదురైన చేదు అనుభవాలు తలచుకుంటూ ఒక ఫోటో షేర్ చేస్తూ " ఈ ఫోటో 2012 నాటిది. ఆ ఏడాది వ్యక్తిగతంగా నాకు అస్సలు మంచి జరగలేదు. వృత్తి పరంగా కూడా చాలా మార్పులు అయితే జరిగాయి. అప్పుడు నా జీవితం నకిలీ వైపుకు మళ్ళింది.. అప్పుడు నాలో మండే మంటలో ఒక బాధ కూడా ఉంది. నా భవిష్యత్తు కోసం ఎప్పుడూ ఏదో ఒకటి వెతుకుతూ,ఇక ఏదో నేర్చుకోవాలని కలలు కూడా కనేదాన్ని. జీవితం నిశబ్దం అనేది చాలా హింసాత్మకంగా అయితే ఉంటుంది" అంటూ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: