పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త.. ఏమిటంటే..?
ఈ క్రమంలోనే రథయాత్ర కూడా చేపట్టారు. ఇందుకోసం వారాహి అనే కొత్త బండిని కూడా ఏర్పాటు చేసి అందులో యాత్ర మొదలు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోకిరి సినిమాతో మొదలైన రీ రిలీజ్ సినిమాల హవా.. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలను కూడా విడుదల చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక శుభవార్తనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ నటించిన లవ్ క్లాసికల్ సినిమా ఖుషి రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. డిసెంబర్ 31వ తేదీన 4K థియేటర్లలో ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఖుషి సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇదే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అభిమానులలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రూపంలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టే అవకాశం కూడా కనిపిస్తోంది అని చెప్పవచ్చు.