టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా సినిమా వాల్తేరు వీరయ్య. ఇక మైత్రీ మూవీస్ బ్యానర్పై తెరకెక్కుతోన్న ఈ సినిమా చిరు కెరీర్లో 154వ సినిమాగా వస్తోంది.ఇకపోతే శృతీహాసన్ హీరోయిన్.కాగా దేవిశ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అయితే వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.ఇదిలావుంటే ఇక తాజాగా రిలీజ్ అయిన టైటిల్ టీజర్ చిరు అభిమానులకే కాకుండా మాస్ జనాలకు కూడా విపరీతంగా నచ్చేసింది. అయితే అప్పుడెప్పుడో చిరంజీవి ముఠామేస్త్రి, అందరివాడు సినిమాలతో మాస్ లుక్తో ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేశాడు.
ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆ రేంజ్ ఊరమాస్ అవతార్లో కనిపించే సరికి ఫ్యాన్స్ అయితే ఫుల్ కిక్లో ఉన్నారు.ఇక మాస్ చిరు ఈజ్ బ్యాక్ అంటున్నారు.అయితే అయితే సినిమా టైటిల్, టీజర్ అంతా బాగానే ఉన్నా.. చివర్లో రవితేజ వాయిస్ ఓవర్ అదిరిపోయినా సినిమా టైటిల్ వీడియో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా డిజప్పాయింట్మెంట్ చేసిందంటున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా అందిస్తోన్న మ్యూజిక్ సినీ ప్రియులను అలరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య.. అది కూడా చిరు సినిమా కావడంతో డీఎస్పీ ఒళ్లు దగ్గర పెట్టుకుని మ్యూజిక్ ఇస్తాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
అయితే అలాంటిది టైటిల్ వీడియోతోనే మనోడు ఇంత నిరాశ పరచడంతో ఫ్యాన్స్ కూడా అసంతృప్తితో ఉన్నారు.ఇక ఓ వైపు థమన్ ఎలా దూసుకు పోతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు.కాగా అలాంటిది చిరు థమన్ను కాదని పట్టుబట్టి మరీ దేవిశ్రీకి ఛాన్స్ ఇస్తే ఇంత దెబ్బేస్తాడా ? అని కొందరు చిరు అభిమానులు సోషల్ మీడియలో ఫైర్ అవుతున్నారు కూడా..! కొన్ని తమిళ సినిమాల మిక్సింగ్ నేపథ్యంలో ఈ టైటిల్ వీడియో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి.అంతేకాదు అసలు థమన్ బీజీఎంతోనే చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి. ఇక అలాంటిది దేవిశ్రీ మెగాస్టార్ చాలా రోజుల తర్వాత చేస్తోన్న డైరెక్ట్ సినిమాకు ఇంత కాపీ బీజీఎం ఇచ్చి నిరాశ పరుస్తాడని తాము అస్సలు ఊహించలేదనే ఫ్యాన్స్ అంటున్నారు.అంతేకాదు కేవలం సెకన్ల వ్యవధిలో వచ్చిన వీడియోనే మెప్పించలేని దేవిశ్రీ రేపు సినిమాను ఇంకెంత నాశనం చేసేసి ఉంటాడో అని ఫైర్ అవుతున్నారు..!!