చిరంజీవితో పోటీకి సై అంటున్న నాగార్జున...!!
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ ఇంటర్పోల్ ఆఫీసర్గా నాగార్జున చాలా బాగా నటిస్తున్నారు. విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న చిత్రాన్ని మేకర్స్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారుఅని సమాచారం . అయితే, అదే రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ఫాదర్' చిత్రం కూడా విడుదల చేసేందుకు ఈ చిత్ర మేకర్స్ రెడీ అవుతున్నారు. దీంతో ఇద్దరు పెద్ద హీరోల సినిమాల క్లాష్ మంచిది కాదనేలా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. కింగ్ నాగార్జున వెనక్కి తగ్గుతాడేమో అని అంతా అనుకున్నారు. దీంతో 'ది ఘోస్ట్' ఆ తేదీకి విడుదల కష్టమే అనేలా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. విడుదల విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్లుగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు దూసుకుపోతున్నారు.
'ది ఘోస్ట్' సినిమా వాయిదా పడినట్లుగా వస్తున్న వార్తలలో నిజం లేదని, చెప్పిన డేట్కి ఖచ్చితంగా సినిమాని విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. వారి స్టేట్మెంట్తో అక్టోబర్ 5న 'ది ఘోస్ట్' వర్సెస్ 'గాడ్ఫాదర్' అనేలా బాక్సాఫీస్ వద్ద ఫైట్ ఉండబోతోంది. అటు 'గాడ్ఫాదర్' టీమ్ కూడా ప్రచార కార్యక్రమాలతో ప్రేక్షకులలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ప్రోమోని కూడా మంగళవారం విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక నాగ్ బర్త్డేకి వచ్చిన 'ది ఘోస్ట్' ట్రైలర్ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచడమే కాకుండా సినిమా కోసం వెయిట్ చేసేలా చేసింది. సో.. రెండు సినిమాలూ పోటాపోటీగా బరిలోకి దిగుతుండటంతో.. దసరాకి బాక్సాఫీస్ వద్ద సందడైతే మాములుగా ఉండదనేది తెలిసిపోతుంది. కాగా, నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ 'ది ఘోస్ట్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.