బింబిసార 'ఓటిటి' విడుదలపై స్పష్టత ఇచ్చిన దిల్ రాజు..!

Pulgam Srinivas
కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ తాజాగా ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బాస్టర్ టాక్ వరల్డ్ వైడ్ గా దక్కింది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

అలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు దక్కుతూ ఉండటంతో ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువగా షేర్ కలెక్షన్ లను వసూలు చేసుకొని బాక్సా ఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకుని లాభాలను కూడా అందుకుంటుంది. ఇలా బింబిసార మోవిర్ మంచి విజయం సాధించడం తో తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో భాగంగా దిల్ రాజు ఈ సినిమా  'ఓ టి టి' విడుదల పై కూడా స్పష్టత ఇచ్చాడు.

బింబిసార మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... బింబిసార మూవీ 50 రోజుల తర్వాతే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి రాబోతుంది అని దిల్ రాజు స్పష్టత ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ , క్యాథరీన్ హీరోయిన్ లుగా నటించగా , ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తో దర్శకుడిగా మల్లాడి వశిష్ట్ తన కెరియర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ క్రూరమైన రాజు పాత్రలో కనిపించాడు. ఈ మూవీ కి ఓవర్ సీస్ లో కూడా అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: