ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు .అయితే ప్రస్తుతం న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే అల్లు అర్జున్ కెరీర్లో ఎప్పుడూ లేనంత మాసీవ్గా పుష్ప సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే.కాగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా కలిసి నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా, సమంత స్పెషల్ సాంగ్లో కనిపించి సందడి చేశారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది.
ఇదిలావుంటే ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసిన మేకర్స్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్లో ఉన్నారు.ఇక సుకుమార్ ముందు అనుకున్న కథతో అయితే ఈ పాటికే చాలా వరకు షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యేది. అయితే కానీ, 'ఆర్ఆర్ఆర్'..'కేజీఎఫ్ 2' చిత్రాల విజయంతో అంతకంటే భారీ హిట్ సాధించాలని మళ్ళీ కథలో కొన్ని కీలక మార్పులను చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే 'పుష్ప: దిల్ రూల్' సెట్స్పైకి వచ్చేందుకు ఆలస్యం అయింది. ఇకపోతే పార్ట్ 1 కోసం అల్లు అర్జున్ ఏ విధంగా మేకోవర్ అయ్యారో అందరికీ తెలిసిందే.ఇకపోతే సీక్వెల్లోనూ అదే లుక్లో కనిపిస్తారని అందరూ భావిస్తున్న సమయంలో ....
ఇలా సరికొత్త లుక్లో దర్శనమిచ్చి ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే లుక్తో పుష్ప సీక్వెల్ మూవీలో కనిపించబోతున్నారని, అందుకే ఈ మాస్ లుక్ని రివీల్ చేశారని మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా ఈ లుక్ విషయానికొస్తే..నోట్లో చుట్ట పెట్టుకొని నళ్ళ కళ్ళజోడుతో జుట్టు కాస్త తెల్లబడి పక్కా మాస్.. అనిపిస్తున్నారు.అయితే ఏదేమైనా అల్లు అర్జున్ తాజా లుక్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఇక ఈ లుక్ పుష్ప సీక్వెల్ కోసమా కాదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది...!!