తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటులలో ఒకరు అయిన విజయ్ సేతుపతి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ సేతుపతి తమిళ ఇండస్ట్రీ లో హీరోగా, విలన్ గా , ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ సేతుపతి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించి మెప్పించాడు. అలాగే పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించి, ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా హీరోగా, విలన్, ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ సేతుపతి తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటనకు గాను ఇటు ప్రేక్షకుల నుండి , అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ సేతుపతి 'మామనిదన్' (మహామనిషి) అనే సినిమాలో హీరోగా నటించాడు.
మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని చిత్ర బృందం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ... విక్రమ్ మూవీ లో అతిథి పాత్రలో నటించిన హీరో సూర్య కు మరియు దర్శకుడు లోకేష్ కనకరాజ్ కు హీరో కమల్ హాసన్ విలువైన గిఫ్ట్ లను ఇచ్చారు అని , తనకు మాత్రం ఒక మహా నటుడితో కలిసి నటించే అవకాశం కల్పించారు అని ఇదే తనకు పెద్ద గిఫ్ట్ అని విజయ్ సేతుపతి తెలియజేశారు.