విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ఎఫ్3. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ మూవీ ఎఫ్2 కి సీక్వెల్ గా రూపొందింది. ఇక తమన్నా, మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించగా.. బుట్ట బొమ్మ పూజ హెగ్డే ఐటెం సాంగ్ లో కనిపించింది. మే 27న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా.ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వస్తోంది. సంబంధం లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో సినిమా యూనిట్ తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం ఎంత ఎమోషనల్ గా మాట్లాడాడు. అందరూ తమ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఇక సక్సెస్ సెలబ్రేషన్స్ కి ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ సైతం హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలను వినిపించారు. సినిమా హిట్ అవ్వకపోతే మీ ఎవరికి నా మొహం చూపించనని అన్నారు రాజేంద్రప్రసాద్. వీడియో బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండగా రాజేంద్రప్రసాద్ ను స్టేజ్ పైకి పిలిపించింది యాంకర్ మంజూష. ఇక రాజేంద్రప్రసాద్ మొహానికి మాస్ పెట్టుకొని ఉండడంతో యాంకర్ మంజూష 'సార్ మాస్క్ తీసేయండి' అని చెప్పింది.
దీంతో రాజేంద్రప్రసాద్ అసహనానికి గురయ్యాడు. 'ఉండవమ్మా నీ గోల? ఇక్కడ మా గోలే ఎక్కువయింది అంటే మధ్యలో నీ గోల ఏంటి? అని అనడంతో ఆంకర్ మంజూషా పక్కకు వెళ్లిపోయింది. అయితే రాజేంద్రప్రసాద్ అలా మాస్క్ వేసుకుని రావడం వెనుక ఉన్న కారణాలను చెప్పారు. ఈ సినిమా హిట్ అవ్వకపోతే తన ముఖాన్ని ఎవరికీ చూపించనని తాను అన్నానని.. కానీ ఇప్పుడు చూపిస్తానంటూ మాస్క్ తీశారు. ఇక సోమవారం కూడా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయంటే సినిమా హిట్ కాకపోతే ఇంకేంటి అని అన్నారు రాజేంద్ర ప్రసాద్. ఇక ఇదే కార్యక్రమంలో అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఇలా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు...!