'కేజీఎఫ్ 3' లో హృతిక్ రోషన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!

Anilkumar
ప్రస్తుతం  దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీయఫ్ 2'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే  'కేజీయఫ్ 3'ని కూడా తెరకెక్కించనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.ఇకపోతే ఈ సీక్వెల్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై నిర్మాత తాజాగా క్లారిటీ ఇచ్చారు.ఇక యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కేజీయఫ్‌ 2'. భారీ అంచనాలతో ఏప్రిల్‌ 14న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే  బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకొని రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇక  ఈ క్రమంలో 'కేజీయఫ్‌ 3' గురించి చర్చ మొదలైంది. ఇదిలావుండగా తాజాగా ఈ స్వీక్వెల్ కోసం హృతిక్‌ రోషన్‌ను చిత్రబృందం సంప్రదించిందని..అంతేకాదు  'కేజీయఫ్‌ 3'లో హృతిక్‌ నటించనున్నారన్న వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ స్పందించారు.ఇక "కేజీయఫ్‌ 3 ఈ సంవత్సరం ఉండదు. అంతేకాదు మేము దీని కోసం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇకపోతే ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ 'సలార్‌' సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే త్వరలోనే యశ్‌ తన కొత్త సినిమాని ప్రకటించనున్నారు. ఇక వాళ్లకు  సమయం దొరికినప్పుడు 'కేజీయఫ్‌'కు సంబంధించిన పనులు ప్రారంభిస్తాం.

ఇదిలావుంటే ప్రస్తుతానికి ఛాప్టర్‌ 3 ఎప్పుడు ప్రారంభమవుతుందనేది చెప్పలేదు. కాగా మేము ఈ సినిమా పనులు మొదలుపెట్టాక అందులో ఎవరెవరు నటిస్తున్నారో చెబుతాము. ఇకపోతే అప్పుడు ఎవరు అవసరమైతే వారిని సంప్రదిస్తాం" అంటూ రూమర్స్‌కు చెక్‌పడేలా 'కేజీయఫ్‌ 3' నిర్మాత సమాధానం ఇచ్చారు.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి ఎన్టీఆర్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే లా ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో సినిమా పూర్తయిన తర్వాతే కేజిఎఫ్ పార్ట్ 3 ఉండబోతున్న ట్లు సమాచారం వినిపిస్తోంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: