ఆచార్య సినిమా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయిన తరవాత అసలు లెక్కలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ సినిమా అసలు ఎన్ని నష్టాలు మిగిలిచ్చింది? ఇక చివరికి ఆ భారాన్ని ఎవరు మోస్తున్నారు?అనే విషయాలు అయితే తేటతెల్లం అవుతున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ అనే పేరు పోస్టర్పై కనిపిస్తున్నా కానీ పెట్టుబడి పెట్టింది మాత్రం మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ మాత్రమేనటా.ఇక ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే. చిరు, చరణ్లు తమ వాటాగా దాదాపుగా రూ.50 కోట్ల రూపాయలు తీసుకెళ్లారు. ఇక అది కాకుండా.. ప్రొడక్షన్ వచ్చేసి రూ.70 కోట్లకు తేలింది.ఆ రూ.70 కోట్లు కూడా మాట్నీకి తిరిగి ఇచ్చేసి.. సినిమా కమర్షియల్ వ్యవహారాల్ని కూడా కొరటాల నెత్తిమీద వేసుకున్నట్టు సమాచారం తెలిసింది. అంటే..ఆచార్య సినిమా విషయంలో అటు మాట్నీకి ఇంకా ఇటు కొణిదెల ప్రొడక్షన్కి ఎలాంటి సంబంధమూ లేదు. ఇప్పుడు బయ్యర్లని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా కొరటాలపైనే పడిందని సమాచారం తెలుస్తోంది.
ఇక కొన్ని ఏరియాల్లో అయితే ఈ ఆచార్య సినిమాని కొరటాల సన్నిహితులే రిలీజ్ చేశారు. వాళ్లందరికీ ఇప్పుడు సర్దుబాటు చేయాల్సిన బాధ్యత కూడా కొరటాల శివపై పడింది.ఇక ఈ మేరకు ఓ ఆచార్య సినిమా బయ్యర్..మెగాస్టార్ చిరంజీవికి ఓపెన్ లెటర్ రాసి, తమని ఆదుకోవాలని కోరాడు. అయితే ఇప్పటికే చిరంజీవి రూ.10 కోట్లు వెనక్కి వచ్చినట్టు తెలుస్తోంది. తన పారితోషికం నుంచి ఈ రూ.10 కోట్లని చిరు తిరిగి ఇచ్చేశాడని టాక్ వినిపిస్తుంది.అయితే ఈ రూ.10 కోట్లు అసలు ఎంత మాత్రమూ కూడా సరిపోవు. ఇక ఆయన నుంచి ఇంకా వస్తాయన్న ఆశతో బయ్యర్లు ఎంతో ఆశగా ఉన్నారు. చిరంజీవి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన తిరిగొచ్చాక..బయ్యర్లతోనూ ఇంకా కొరటాలతోనూ ఓ కీలకమైన మీటింగ్ జరగబోతోందని టాక్ వినిపిస్తుంది. ఆ తరవాత.. చిరు నష్టాల భర్తీ చేస్తారని సమాచారం తెలుస్తోంది.