ఆచార్య ప్రమోషన్ లలో భాగంగా భవదీయుడు భగత్ సింగ్ మూవీ నుండి అదిరిపోయే డైలాగ్ ను లీక్ చేసిన హరీష్ శంకర్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తేదీన గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'సిద్ధ'  అనే ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.  ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే 'నీలాంబరి'  పాత్రలో కనిపించబోతుంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఆచార్య చిత్ర బృందం సినిమా ప్రమోషన్ లను వేగవంతం చేసింది.  అందులో భాగంగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి ,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,  దర్శకుడు కొరటాల శివ ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఇంటర్వ్యూ చేశాడు.  

ఈ ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్ ,  పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కబోతున్న భగత్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే  డైలాగ్ ను లీక్ చేశాడు. అసలు విషయంలోకి వెళితే... ఇంటర్వ్యూ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ,  హరీష్ శంకర్ ను మొన్న ఒక డైలాగ్ చెప్పావు చాలా బాగుంది అని  హరీష్ శంకర్ తో అనగా...  అది భవదీయుడు బాగా సింగ్ సినిమా లోది సార్ అని అన్నాడు.  

దానితో హరీష్ శంకర్  సినిమా లోని డైలాగ్ ను చెప్పాడు.  విలన్ ... మొన్న వీడు మన ఇంటికి వచ్చి పెద్దగా అలసినప్పుడు అసలు ఏంట్రా వీడు ధైర్యం అని అనుకున్నా...  కానీ ఇప్పుడు అర్థం అయ్యింది... వీడు నడిస్తే వీధి వెనకాల లక్ష మంది నడుస్తున్నారు... బహుశా ఇదే ఇతని ధైర్యం ఏమో... క్యారెక్టర్ ఆర్టిస్ట్ ... లేదు సార్...  ఆ లక్ష మందికి ఆయన ముందు ఉండి నడిపిస్తున్నాడు అనేది ధైర్యం. అనే డైలాగ్ ను దర్శకుడు హరీష్ శంకర్ చెప్పేశాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ చెప్పిన ఈ డైలాగ్ నెటింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: