సూర్య ఓ మై డాగ్ మూవీ రిలీజ్ డేట్ లాక్.. ఓటీటీ వేదికగా..?

frame సూర్య ఓ మై డాగ్ మూవీ రిలీజ్ డేట్ లాక్.. ఓటీటీ వేదికగా..?

Divya
సినీ ఇండస్ట్రీలోని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒక సంచలనమైన హీరో అని చెప్పవచ్చు.. ఏ పాత్రలో నటించిన సరే ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడు అంతేకాదు గతంలో ఆ పాత్ర ఇలాగే ఉండేదా అన్నట్టు కళ్లకు కట్టినట్లు చూపించే నైజం సూర్య ది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సూర్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాను తెరకెక్కించే సినిమాలు నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఆశ్చర్యకరం చెప్పవచ్చు. అంతే కాదు సూర్య గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించే సినిమాలు కూడా ఏకంగా ఆస్కార్ నామినేషన్ కు వెళ్తున్నాను అంటే ఆయన ఏ రేంజ్ లో సినిమాలను తెరకెక్కిస్తున్నాడు మనం అర్థం చేసుకోవచ్చు.


ఇటీవల వచ్చిన జై భీమ్ సినిమా ఏ రేంజ్ లో విజయం సొంతం చేసుకుందో అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు ఈ సినిమా ఏకంగా ఆస్కార్ కు నామినేట్ అయింది ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంటుంది అనే నేపద్యంలో చివరి లో ఈ సినిమా ఆస్కార్ ను మిస్ చేసుకోవడం కొంతవరకు విషాదకరమే అని చెప్పవచ్చు. ఇకపోతే ఈయన భార్య జ్యోతిక కూడా అందరికీ సుపరిచితురాలే ఎన్నో సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే వివాహం తర్వాత ఆమె తన భర్త సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది జ్యోతిక.


అయితే తాజాగా సూర్య తన భార్య జ్యోతిక తో కలిసి నిర్మిస్తున్న ఓ మై గాడ్ సినిమా త్వరలోనే రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే డైరెక్టుగా థియేటర్లలో కాకుండా ఈసారి ఓటీటీ లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఓ మై డాగ్ చిత్రం ఏప్రిల్ 21వ తేదీన అమెజాన్ ప్రైమ్ ఓ టీ టీ వేదికగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎలా ఉంటుందో ఏ కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తారో సూర్య అని తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: