పబ్ కేసులతో మాకు సంబంధం లేదంటున్న గల్ల ఫ్యామిలీ..!!

Divya
హైదరాబాద్ లో తాజాగా మరొక భారీ రేవ్ పార్టీ బయటపడింది.. నగరంలో బంజారాహిల్స్ లో రాడిసన్ బ్లూ హోటల్ పైన టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేయడంతో.. దాదాపుగా 157 మందికి పైగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందులో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ పార్టీలో ఖచ్చితంగా డ్రగ్స్ వాడినట్లుగా అధికారులు తెలియజేశారు దీంతో అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది.. ప్రస్తుతం పోలీసులు అదుపులో డ్రగ్స్ తీసుకున్న వారిని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మిగతా వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపించినట్టుగా సమాచారం.అలా పట్టుబడిన వారిలో నాగబాబు కుమార్తె నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు వారికి నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఈ డ్రెస్సు కేసులో కొంతమంది ప్రముఖ పిల్లలు కూడా పట్టుబడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారుతోంది వీరిలో కొంత మంది సినీ ప్రముఖులు కాగా మరికొంత మంది సినీ రాజకీయ నాయకులకు చెందిన వారి పిల్లలు కూడా ఉన్నట్లు పేరు బయటకు రావడంతో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది.. ముఖ్యంగా ఇందులో టిడిపి ఏపీ ఎంపీ కొడుకు టాలీవుడ్ యువ హీరో గల్లా అశోక్ కూడా ఉన్నట్లుగా మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయంపై గల్లా ఫ్యామిలీ స్పందించి పబ్  వివాదంలో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించి ఒక మీడియా నోట్ను కూడా గల్లా కుటుంబ సభ్యులు విడుదల చేశారు. నిన్నటి రోజున హైదరాబాదులో లో పబ్ పై పోలీసులు రైడ్ జరుపగా అందులో గల్లా అశోక్ పేరు కూడా ఉన్నట్లు కొంతమంది మీడియా సంస్థ వారు తెలిపారు కానీ ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఏ విధంగా సంబంధం లేదని దయచేసి ఇలాంటి వార్తలు రాయకండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు కుటుంబ సభ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: