"రాధే శ్యామ్": ముంబైలో మొదటి షో చూడనున్న ప్రభాస్ అండ్ టీమ్... ?

VAMSI
రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్, పూజా హెగ్డే లు హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా "రాధే శ్యామ్"  రేపు రిలీజ్ అవబోతున్న విషయం తెలిసిందే.  డార్లింగ్ మూవీ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది. పీరియాడిక్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్స్ పతాకంపై రాధే శ్యామ్ ను మెగా బడ్జెట్‌తో నిర్మించారు. మార్చి 11న అనగా రేపేనండోయ్.. ప్రపంచ వ్యాప్తంగా రాధే శ్యామ్ ఎంతో ఘనంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ అయ్యాయి . దాదాపు వారం వరకు టికెట్లు దొరకడం కష్టమే అంటున్నారు. ఆ రేంజ్ లో ఈ సినిమాకి బుకింగ్స్ జరుగుతున్నాయని, ఈ మూవీ బిజినెస్ మామూలుగా లేదని  బయట టాక్.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసేందుకు రెబల్ స్టార్ ఏకంగా ఓ థియేటర్ నే బుక్ చేశారట. తన ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్ తో కలసి రేపు సినిమాను చూసేందుకు ముంబైలో ఓ లగ్జరీ థియేటర్ ప్రభాస్ పేరుపై బుక్ అయినట్లు బాలీవుడ్ మీడియా నుండి సమాచారం అందుతోంది. అయితే మొదట ఇక్కడ మన తెలుగులో సినిమాని ఆస్వాదించాలి అనుకున్న ప్రభాస్ ప్రస్తుత తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్ పనిలో ముంబయిలో చాలా బిజీగా ఉన్న కారణంగా అక్కడే సినిమా చూడటానికి థియేటర్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది అని తెలుస్తోంది.

ఇది ప్రస్తుతానికి ఒక గాసిప్ మాత్రమే. అయితే ఇందుల ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. కాగా రాధే శ్యామ్ సినిమా హిట్ అయితే ప్రభాస్ కు అదృష్టం పట్టినట్లే. మరి ఈ సినిమా ఫలితం ఎలా రాబోతోంది అని చిత్రబృందం మరియు ప్రభాస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా సక్సెస్ అయ్యి అందరికీ మంచి పేరును తీసుకురావాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: