లబ్ డబ్ - లబ్ డబ్ - డబ్బో : వెంకీ, వరుణ్ తేజ, రావిపూడి

Pulgam Srinivas
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కి 2019 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమా ఎఫ్ టు. ఇలా ఎఫ్ టు సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ సినిమాకు ప్రాంచైజీ గా ఎఫ్ త్రీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు,  అయితే ఈ సినిమాలో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు, అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

 ఇలా ప్రేక్షకులు మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కారణంగా ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచుతోంది,  అందులో భాగంగా ఈ సినిమా మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.  ఎఫ్ త్రీ సినిమా లోని మొదటి లిరికల్ సాంగ్ ను ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది.  ఈ పోస్టర్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరు ఉన్నారు. ఈ పాట లాబ్ డబ్  లాబ్ డబ్  డబ్బో అంటూ సాగబోతుంది. ఎఫ్ టు సినిమాకు సంగీతం సమకూర్చిన దేవి శ్రీ ప్రసాద్ 'ఎఫ్ త్రీ' సినిమాకు కూడా సంగీతం సమకూరుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: