సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా కు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడని అందరికి తెలిసిందే.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చిందట.. దాంతో సినిమా నుండి ఒక్కొక్కటి చొప్పున పాటను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం సినిమా నుండి మొదటి పాట రిలీజ్ కు సంబంధించిన ప్రమోషన్ మొదలు అయ్యిందని సమాచారం . మొదటి పాట ను ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవలే థమన్ కూడా ప్రకటించాడు. ఈ మద్య కాలంలో సిద్ శ్రీరామ్ పాడిన పాటలు అన్ని కూడా సూపర్ హిట్ అవుతున్నాయట.. దాంతో సర్కారు వారి పాట సినిమా కోసం కూడా సిద్ తో ఒక పాటను పాడించాలని థమన్ నిర్ణయించుకున్నాడని తెలుస్తుంది.. అది ఏం పాట.. ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయం లో క్లారిటీ రావాల్సి ఉందని తెలుస్తుంది.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా కు సిద్ శ్రీరామ్ పాడబోతున్న పాట హైలైట్ గా ఉంటుందని అందరూ కూడా అంటున్నారు. అల వైకుంఠపురంలో సినిమా మ్యూజిక్ ఆల్బమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడానికి ప్రథాన కారణం సిద్ పాడిన పాట అనడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక పుష్ప లో శ్రీవల్లి పాట ఆయన పాడటంతో ఇప్పుడు ఏ స్థాయిలో ట్రెండ్ అవుతుందో మనం అందరమూ కూడా చూస్తూనే ఉన్నాం. రికార్డు బ్రేకింగ్ లో వ్యూస్ ను ఈయన పాడిన పాటలు దక్కించుకుంటున్నాయని తెలుస్తుంది.. కనుక థమన్ సర్కారు వారి పాట కోసం కూడా తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం.. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో వరుస పాటలు విడుదల చేసే అవకాశం ఉందట.. సర్కారు వారి పాట సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఫిబ్రవరి మరియు మార్చి లో బ్యాక్ టు బ్యాక్ పాటల సందడి ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.. పుష్ప మ్యూజికల్ హిట్ అయిన నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమా పాటలు సూపర్ హిట్ చేసే పట్టుదలతో థమన్ ఉన్నట్లుగా సమాచారం.