షేకింగ్ న్యూస్ : ఎన్టీఆర్ మూవీకి వర్క్ చేయనున్న ఏ ఆర్ రెహమాన్ .... ??
యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమా ఈనెల 7న గ్రాండ్ గా లాంచ్ కానుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్, సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ ఎంపికైనట్లు టాక్. ఎన్టీఆర్ కెరీర్ 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ కమర్షియల్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే దీని అనంతరం ఇప్పటికే మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై కెజిఎఫ్ సినిమాల దర్శకడు ప్రశాంత్ నీల్ తో ఒక మూవీ కమిట్ అయిన ఎన్టీఆర్, దాని అనంతరం చేయబోయే మరొక సినిమాని కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఇటీవల తన తొలి సినిమా ఉప్పెన ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కొట్టిన బుచ్చిబాబు సనా ఈ సినిమా తీయనున్నట్లు టాక్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే గ్రామీణ నేపధ్య కథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కబడ్డీ ప్లేయర్ గా నటించనుండగా, దీనికి ప్రఖ్యాత సంగీత దర్శకడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. కాగా ఈ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్ వారు ఎంతో భారీ స్థాయిలో నిర్మించనున్నారని, త్వరలో దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే తొలిసారిగా యంగ్ టైగర్, ఏ ఆర్ రెహమాన్ కాంబినేషన్ లో అద్భుతమైన సాంగ్స్ వినవచ్చు.