విషాదం: గొల్లపూడి మారుతీరావు సతీమణి మరణం...

VAMSI
ఎందరో మహాను భావులు సినిమాలో నటించి ప్రజల మనసులలో నిలిచి పోయారు. కొందరు అయితే మరణించినా ఇప్పటికీ వారి పేరును తలుచుకుంటూ ఉంటారు. అటువంటి అతి తక్కువ మంది నటులలో దివంగత నటుడు గొల్లపూడి మారుతీ రావు ఒకరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈయన తెలుగు సినిమాలలో వివిధ పాత్రలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో చిత్రాల్లో సహాయక నటుడిగా తనదైన శైలిలో నటించి మెప్పించి తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు. నటుడు మారుతీ రావు అనారోగ్యం కారణంగా 2019 డిసెంబరులో మరణించిన విషయం తెలిసిందే .
కాగా ఇప్పుడు ఆయన భార్య కూడా మరణించడం బాధాకరమైన విషయం.  ఈయన భార్య శివకామ సుందరి శుక్రవారం నేడు మరణించారు. చెన్నైలో వీరి స్వగృహం టి.నగర్‌లో ఉండగా ఇంట్లోనే ఈమె చివరి శ్వాస విడిచారు. సమాచారం అందుకున్న బంధు మిత్రులు ఇంటికి గొల్లపూడి మారుతీ రావు గారి ఇంటికి చేరుకుని శివకామ సుందరి
గారికి నివాళి అర్పిస్తున్నారు. ఆమె భౌతిక కాయానికి కన్నమ్మ పేట శ్మశాన వాటికలో శుక్రవారం రోజునే అంత్యక్రియలు జరిపించారు. దీనితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హన్మకొండ వాసి అయిన సివకామి సుందరి గారికి నటుడు గొల్లపూడి మారుతి రావుతో 1961లో వివాహం జరిగింది.  వీరికి ఇద్దరు కొడుకులు కాగా ఒక కుమారుడు వైజాగ్ లో ప్రమాదవ శాత్తు మరణించిన విషయం తెలిసిందే. 2019 లో భర్త మారుతి రావు మరణం తరవాత సుందరి గారు ఆమె తన రెండవ కుమారుడు వద్దనే చెన్నైలో  వుంటున్నారు. దీనితో సినిమా ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగి పోయింది. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆమెకు సంబంధించిన బంధువులు కానీ లేదా ఇండస్ట్రీ వ్యక్తులు కానీ వెళ్లలేని పరిస్థితిలో సందేశాల ద్వారా వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియయచేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: