నట సింహం నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతి సంబురాలు అక్క పురందేశ్వరి ఇంట్లో చాలా సంబరంగా జరుపుకున్నారు.ఇక నిన్న జరిగిన భోగీ మంటల పండగ నుండి బాలయ్య చేస్తున్న హంగామాకి అంతు లేదు. బాలయ్య అక్క అయిన పురందేశ్వరి ఇల్లంతా బాలయ్య అభిమానులతో నిండిపోయింది. ఇకపోతే ఇవాళ బాలకృష్ణ సంక్రాంతి సంబురాల్లో గుర్రపు స్వారీ చేశారు. గుర్రం ఎక్కడమే కాకుండా బాలయ్య తను ఎక్కిన గుర్రం తో కలిసి స్టెప్పులు కూడా వేశారు .అయితే ప్రస్తుతం బాలయ్య గుర్రం తో కలిసి వేసిన స్టెప్పుల వీడియో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక అసలు విషయానికి వస్తే ఈ సంక్రాంతి వేడుకల్లో అందరి చూపు నట వరుసుడిపైనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ సినిమా ల ఎంట్రీ ఈ ఏడాది ఉంటుంది.. వచ్చే ఏడాది ఉంటుంది ....అని చెప్పుకోవడం తప్ప మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడం లేదు...ఆ ఈ విషయంపై ఎవరు క్లారిటీ కూడా ఇచ్చింది లేదు. అంతేకాకుండా ఒకానొక సమయంలో బాలయ్య బాబు సైతం తాను మరియు తన కొడుకు ఇద్దరు కలిసి ఒక కథలో నటిస్తాం అని మాట కూడా ఇచ్చారు కానీ ...అది ఎప్పుడు జరుగుతుందో మాత్రం క్లారిటీ గా చెప్పలేదు.
ఇకపోతే ఈ సంక్రాంతి వేడుకల్లో మోక్షజ్ఞ ని చూస్తుంటే ఇంకా హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా లేడన్నట్లే కనిపిస్తున్నాడు.
ఎప్పుడూ ఉన్నట్టుగానే బొద్దుగా అలాగే ఉన్నాడు. ఇకపోతే మోక్షజ్ఞ ని ఇలా చూసినా అభిమానులంతా సినిమాల గురించి ఆలోచించడం లేదన్న మాట వాస్తవమే అని గుసగుసలాడుతున్నారు. ఇక ఈ విషయం ఇలా ఉంటే మరోపక్క మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి లేదని, అందుకే ఇంకా క్లారిటీ రాలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఏదేమైనా మోక్షజ్ఞ రాకకోసం చిత్ర పరిశ్రమ వేయి కళ్ళతో ఎదురుచూస్తుంది..? మోక్షజ్ఞ ఎంట్రీకి మోక్షం ఎప్పుడు కలుగుతుందో చూడాలి మరి...!!