నాగ్ మరో డైరెక్టర్ తో సినిమా ఓకే చేశాడా!!

P.Nishanth Kumar
నాగార్జున హీరోగా నటించిన బంగార్రాజు చిత్రం సంక్రాంతికి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు కానీ తప్పకుండా సంక్రాంతికి వచ్చి ప్రేక్షకులను అలరిస్తుందని మాత్రం చెబుతున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తుండగా వీరిద్దరికీ జోడిగా రమ్య కృష్ణ మరియు కృతి శెట్టి లు నటిస్తున్నారు. మొదటి నుంచీ ఈ సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రావాలని భావించిన నాగార్జున దాన్ని టార్గెట్ గా పెట్టుకొని సినిమాను పూర్తి చేస్తూ వచ్చాడు. 

అయితే అనుకోని విధంగా సంక్రాంతికి వచ్చే పెద్ద సినిమాల్లో పోస్ట్పోన్ కావడంతో ఇప్పుడు బంగార్రాజు సినిమా హాట్ ఫేవరేట్ గా సంక్రాంతి బరిలోకి దిగుతుంది. తొందర్లోనే ఈ సినిమా యొక్క విడుదల తేదిని అధికారికంగా ప్రకటించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టనుండి చిత్ర బృందం. మరి ఈ సినిమా ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేస్తుందో ఇకపై చూడాలి.  ఇక ఈ సినిమాతో పాటే నాగార్జున పోస్ట్ అనే మరొక చిత్రాన్ని కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

 ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల అయింది ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా నాగార్జున ఈ చిత్రం తర్వాత చేయబోయే సినిమాను ఓకే చేసాడని ఇప్పుడు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకు నాగార్జున ఫిదా అయ్యాడని తెలుస్తోంది. తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించన్నాడు నాగార్జున. తాను ఇదివరకు ఎప్పుడూ చేయని జోనర్లో ఎప్పుడూ చేయని కథలు ఎప్పుడు రాణి గెటప్ తో ఈ సినిమాలో కనిపించబోతున్నాను అని ఆయన చెబుతున్నడం విశేషం. మరి మంచి మంచి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు నాగార్జున ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: